


ఇవి సప్త మహా ఋషులలో ముగ్గురైన వశిస్ట, విశ్వామిత్ర, జమదగ్ని ల కాంస్య విగ్రహాలు.వీటి ఈ దుస్థితి కి కారణం వీటి తయారీకి వాడిన లోహమేనని అర్ఢమవుతుంది.
బహుశ 2002 లో అనుకుంటా 2003 లో జరగబోయే గోదావరి పుష్కరాల నిమిత్తం కొవ్వూరు వైపున గోదావరి ఒడ్డున కొన్ని సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా సప్త మహా ఋషుల కాంస్య విగ్రహాలను ఆనాటి ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి తయారుచేయించి గోష్పాదక్షేత్రం పొడవునా రోడ్డు ప్రక్కగా ప్రతిష్టింపచేసింది.
ఖరీదైన లోహాల మిశ్రమం తో తయారవటం చేత దొంగల కళ్ళు పడి ఈ ముగ్గురు విగ్రహాల చేతులూ, కమండలాలూ వగైరా మాయమైపోయాయి. విగ్రహాల అవయవాలను కరిగించి అమ్ముకోవటమే వ్యాపారంగా గల దొంగల పనే ఇది. నిత్యం 24 గంటలూ వేలాది వాహనాలూ జనులూ సంచరించే ప్రాంతం అయినా ఇలా విగ్రహాల అవయవాలను ఖండించి తీసుకు పోగలగటం నాకిప్పటికీ ఆశ్చర్యమే. పుష్కరాలు జరిగిన తరువాత సంవత్సరంలోపే ఇదంతా జరిగిపోయింది.
విచిత్రమేమిటంటే ఇది జరిగి సుమారు 6 సంవత్సరాలైనా ఇప్పటివరకూ ఈ విగ్రహాల పరిస్థితి అలాగే వుంది.
Tuesday, April 14, 2009
ఇదొక రకం అవయవ వ్యాపారం.
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment