కొన్ని సంఘటనలలో మన పొరపాట్లు లేకపోయినా, మనసుని పాడుచేసే సందర్భాలు ఎదుర్కోవలసి రావటం అనేది ఎవరికైనా అనుభవమే.
రోజువారీ కార్యక్రమాలలో అనుభవమయ్యే కష్ట నష్టాలు, అవమానాలు, కలతలు, నలతలూ మన మనసులను అప్పుడప్పుడు పాడు చేయటం సహజంగా జరుగుతూనే వుంటుంది. కాని వాటిని వేటికవి విడదీసి చూసుకుని సంకుచితంగా విశ్లేషించుకుని బాధపడటం తప్పు. అలా చిన్న చిన్న వాటికి అతిగా స్పందించటం మాని, ఇంకా పైస్థాయి నుంచి వాటిని అవగాహన చేసుకుంటూ, వాటి పరమార్ధం ఏమైవుండవచ్చో గ్రహిస్తూ, వాటి వలన జరుగబోయే మంచిని అంచనా వేయాలి. అలా ముందుకు సాగాలి.
గతంలో మనల్ని బాధపెట్టిన అనేక సందర్భాలను గుర్తు తెచ్చుకుంటే వాటివలన తదనంతర కాలంలో మనకు జరిగిన మంచి, మనలో వచ్చిన మంచిమార్పులు ఎవరైనా గుర్తించవచ్చు. మనం ఎదుర్కొనే కష్టాలు, అపజయాలు మనలను మరింత బలంగా తయారు చేస్తాయి.
ఇంకా చెప్పాలంటే ఈ పరిస్థితులన్నీ గతంలో మనం చేసిన పనుల ఫలితాలే. మనం అనుభవించక తప్పదు. మనం గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయం "జరిగిందంతా మంచే, జరగుతున్నదీ మంచే, జరుగబోయేది మంచే".
Thursday, October 25, 2007
అంతా మన మంచికే
Labels: ఆధ్యాత్మికం
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 8:05 PM
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment